ఛీ..ఛీ.. టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు : వైఎస్​ షర్మిల

ఛీ..ఛీ.. టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు : వైఎస్​ షర్మిల

ఛీ..ఛీ.. టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు : వైఎస్​ షర్మిల

తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను, దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్​ వైఎస్​ షర్మిల ట్విట్టర్​వేదికగా స్పందించారు. సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయి. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే... తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయండి. లేదా CBI తో విచారణ జరిపించండి. మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని షర్మిల డిమాండ్ ​చేశారు.